NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హారాష్ట్ర స‌ర్కార్ ను కూల్చే ప్ర‌య‌త్నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత గుజరాత్‌కు మకాం మార్చడంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని చూస్తున్నారని అన్నారు. అయితే శివసేన నమ్మకస్థులతో కూడిన పార్టీ.. ప్రభుత్వాన్ని కూలనీయబోమని వ్యాఖ్యానించారు. ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడుతున్నామని, ఆయన తిరిగి మహారాష్ట్రకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు కీలక భేటీ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

                                             

About Author