NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూరులో దొంగ ఓట్లు వేసేందుకు యత్నం..

1 min read

– పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ 10వ వార్డు ఉప ఎన్నిక పోలింగ్‌లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్న కొందరు మహిళలను టిడిపి ఏజెంట్లు పట్టుకున్నారు. వార్డుల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తుండగా స్థానిక ఏజెంట్లు వారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పగిడ్యాల మండలం పాలమర్రి, నందికొట్కూరు పట్టణం ఏబీఎం పాలెం, ట్యాంక్ ఏరియాకు చెందిన వారిగా గుర్తించారు. దీనితో పోలింగ్‌ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు కానివారికి స్లిప్పులు ఇస్తున్నారంటూ తెదేపా శ్రేణులు నిరసన తెలియజేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద దొంగ ఓటు వేసేందుకు వచ్చిన మహిళలను తెదేపా కార్యకర్తలు అడ్డుకుని ప్రశ్నించారు.

About Author