NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాబా చెప్పాడ‌ని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌కాశం జిల్లాలోని మార్కాపురంలో గల ఓ ప్రైవేటు లాడ్జిలో విద్యార్థిని బ్లేడ్‌తో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ అఘాయిత్యానికి ముందు నాలుగు పేజీల లేఖను విద్యార్థిని తన తండ్రికి వాట్సప్‌ ద్వారా పంపించింది. తనకు ఓ బాబా చెప్పిన విషయాలని విద్యార్థిని లేఖలో ప్రస్తావించింది. తన వల్ల కుటుంబానికి హాని ఉందని బాబా చెప్పినట్టు పేర్కొంది. కుటుంబం బాగుండాలని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. తన మృతదేహాన్ని లాడ్జి నుండి తీసుకువెళ్లాలంటూ తండ్రికి విద్యార్థిని అడ్రస్ పెట్టింది. విద్యార్థిని సీఎస్ పురంలో థర్డ్ ఇయర్ ఏజీ బీఎస్సీ చదువుతోంది. లేఖను చూసిన తండ్రి వెంటనే మార్కాపురం పోలీసులను అప్రమత్తం చేశాడు. హుటాహుటిన లాడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న విద్యార్థిని హాస్పటల్‌కు తరలించి చికిత్స అందజేశారు.

                          

About Author