PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమయానికి విధులకు హాజరు కావాలి

1 min read

– ఎంపీడీవో విజయసింహారెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి గ్రామ సచివాలయంలో ప్రతి ఒక్కరు విధులకు హాజరుకావాలని బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని శనివారం నాడు బిలకల గూడూరు గ్రామంలోని గ్రామ సచివాలయం తనిఖీలో ఎంపీడీవో విజయ్ సింహ రెడ్డి గ్రామ సచివాలయం సిబ్బందిని ఆదేశించారు పి ఎం జె ఏ వై ఈ కేవైసీ వేగవంతం చేయాలని జిల్లాలో మండలం వెనుకబడి ఉందని సోమవారం కల్లా ఈ కేవైసీ పూర్తి చేయాలని వాలంటీర్లను ఆదేశించారు పౌర సేవలను ప్రజలకు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు గ్రామంలో ఉన్న ఎంపీపీ యూపీ స్కూల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలని పాఠశాలలో ఏర్పాటు చేసిన మొబైల్ ఆధార్ సెంటర్ ను పరిశీలించారు.

About Author