PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసుల వైఖరి.. దారుణం

1 min read
విలేకరులతో మాట్లాడుతున్న చైర్మన్ అభ్యర్థి జగన్

విలేకరులతో మాట్లాడుతున్న చైర్మన్ అభ్యర్థి జగన్

టీడీపీ మహిళా కౌన్సిలర్ ను తీసుకెళ్తారా.!
–మైదుకూరు టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జగన్
పల్లెవెలుగు, మైదుకూరు:
వివాదాస్పద రీతిలో తమ తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ అభ్యర్థిని పోలీసులు తీసుకెళ్లడం చాలా దారుణమని కడప జిల్లా మైదుకూరు టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జగన్ ఆరోపించారు. మైదుకూరులో మొత్తం 23 వార్డులకు గాను 12 వార్డులో టిడిపి అభ్యర్థులు 11 వార్డులలో వైసిపి అభ్యర్థులు గెలుపొందారని తమ 12 మంది గెలిచిన అభ్యర్థుల తో సహా అందరూ ప్రొద్దుటూరులోని మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఉండి అక్కడి నుండి 6 వ వార్డు లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ మైనారిటీ మహిళా అభ్యర్థిని వేరే సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో ప్రొద్దుటూరులోని ఎర్ర ముని రెడ్డి కాలనీ దగ్గర మైదుకూరు పోలీసులు బలవంతంగా ఆమెను తమ వాహనం నుండి దించి వారి వాహనంలో ఎక్కించుకుని అధికార పార్టీ శాసన సభ్యుని నివాసానికి తీసుకెళ్లడం జరిగిందని ఆరోపించారు. ఇది చాలా పిరికిపంద చర్య అని అన్నారు. మైదుకూరులో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని ప్రజల తీర్పును గౌరవించాలే గాని ఇలా పిరికిపంద చర్యలకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు.

About Author