NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యాగంటిలో ముగిసిన వేలంపాటలు

1 min read

– రూ.1.66 లక్షలు ఆదాయం
పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె : మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో గురువారం కొబ్బరి చిప్పలు, తలనీనాలు పోగు చేసుకునే హక్కు సంబంధించి వేలంపాటలు నిర్వహించారు. దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటల్లో తలనీలాలు పోగు చేసుకునే హక్కును బనగానపల్లెకు చెందిన హనుమంతు అనే వ్యక్తి 2.91 లక్షలకు పాడి దక్కించుకున్నాడు. తలనీలాలకు సంబంధించి గత ఏడాది కంటే 1.66 లక్షలు ఆదాయం లభించినట్లు ఈవో తెలిపారు. అయితే కొబ్బరిచిప్పలు పొగుచేసుకునే హక్కుకు సంబంధించి పోటీలేక వేలంపాట రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.

About Author