NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్ఐ రమేష్ బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: అటో డ్రైవర్లు  ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ బాబు పేర్కొన్నారు. గురువారంరాయచోటి అర్బన్  సి ఐ సుధాకర్ రెడ్డి గారి  ఆదేశాలు మేరకు బంగ్లా సమీపంలో నేతాజీ సర్కిల్ వద్ద అటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్ టి సి వాహనాలకు మరియు ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండాచూడాలని తెలిపారు.వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపి ఇతరులకు అంతరాయం కలిగించవద్దన్నారు.ప్రతిఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ప్రజలతో కలుపుగోలుగావ్యవహరించాలన్నారు.అదేవిధంగా లైసెన్సులు లేకుండా ఆటోలు నడిపితే  కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో HC చంద్ర శేఖర్ ,  HC రమణ, HC వేణు గోపాల్ నాయక్ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author