NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయ‌చోటిలో ఆటో డ్రైవ‌ర్లు స‌హ‌క‌రించాలి !

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి : రాయచోటిలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి ఆటో డ్రైవర్లు సహకరించాలని రాయచోటి ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ బాబు పేర్కొన్నారు. శనివారం రాయచోటి పట్టణంలో నేతాజీ సర్కిల్ సమీపంలోని బస్ స్టాప్ వద్ద ఆటోలలో వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు మార్గం వైపు, మదనపల్లి మార్గం వైపు వెళ్లు ఆటో డ్రైవర్లు, తమ ఆటో లను నేతాజీ సర్కిల్ లోని బస్ స్టాప్ లో ఆపడం వల్ల ఏపీఎస్ఆర్టీసీ వారికి, అందులో ప్రయాణం చేసేవారికి ఇబ్బంది కలుగుతుంద‌ని తమ దృష్టికి రావడంతో ఆటో ప్రయాణికుల కోసం ఈ స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని అటో డ్రైవర్లు గమనించి ఇకపై ఆటోలను బస్ స్టాపులో ఆటోలు నిలప‌రాదన్నారు. ఇది ప్రయోగాత్మకంగా చేప‌ట్టామ‌ని, మంచి ఫలితాన్ని ఇస్తే ఇలాగే కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

                                  

About Author