PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

28, 29 తేదీల్లో ఆటోలు బంద్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆటో చార్జీలు పెంచాలని కోరుతూ పలు ఆటో సంఘాలు ఈ నెల 28, 29 తేదీల్లో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్‌లను ఆదుకొనేందుకు చార్జీలు పెంచాలని, కొత్తగా మరో 20 వేల పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్, క్యాబ్‌ యూనియన్స్‌ జేఏసీ నేతలు బి.వెంకటేశం, సత్తిరెడ్డి, మల్లేష్‌ గౌడ్, మారయ్య, అమానుల్లాఖాన్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌లో భవిష్యత్‌ కార్యాచరణపై ఆటో, క్యాబ్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. నగరంలో 8 ఏళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో ఆటోడ్రైవర్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

                                      

About Author