PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృద్ధులకు, వికలాంగులకు ‘అవోపా’ చేయూత

1 min read

క‌ర్నూలు: అవోపా కర్నూలు వారి ఆధ్వర్యంలో యోజన ఆసరా  కార్యక్రమం కింద దివంగ‌త కాల్వ సూర్యనారాయణ గుప్త కుటుంబ సభ్యులు అందించిన ఆర్థిక సహకారంతో ఆదివారం ఉదయం గోశాల ప్రాంగణంలో 110 మంది ఆర్యవైశ్య వృద్ధులు వికలాంగులు, వితంతువులకు ఒక్కొక్కరికి 600-00  రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు శ్రీ గోనూరు యుగంధర్ శెట్టి అధ్యక్షత వహించగా దాతలు కాల్వ ప్రసాద్ చేతుల మీదుగా  సరుకులను పంపిణీ చేయడమైనది. ఈకార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి టి వి రత్న ప్రసాద్ , చీఫ్ కన్వీనర్  మలిపెద్దు నాగేశ్వరరావు, కార్యదర్శి పోలేపల్లి శేషయ్య, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. అవినాష్ శెట్టి సభ్యులు పుల్లా ఆంజనేయులు, చిన్ని పాండురంగ, నాగెళ్ళ హరికిషన్, విష్ణువర్ధన్ గుబ్బా వెంకటరమణ నాగరాజు, రామ లక్ష్మయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author