PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవకు… పురస్కారం…

1 min read

పల్లెవెలుగు వెబ్,కర్నూలు: 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవ అందించిన ఉద్యోగులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సోమవారం పోలీస్​ పేరెడ్​ గ్రౌండ్​లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుల గురించి ప్రసంగించారు. పోరాట యోధుల త్యాగఫలమే స్వాతంత్ర్యమని పేర్కొన్న మంత్రి..  దేశ ఆర్థిక అభివృద్ధి, వివిధరంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం మంత్రితోపాటు కలెక్టర్​ కోటేశ్వరరావు, జాయింట్​ కలెక్టర్​ రామసుందర్​ రెడ్డి చేతుల మీదుగా  ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసపత్రాలు, అవార్డులు అందజేశారు. అందులో భాగంగా డిస్ట్రిక్​ కో ఆపరేటివ్​ ఆఫీస్​లోని సీనియర్​ ఇన్​స్పెక్టర్​ యు. సాంబశివరావుకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి, కలెక్టర్​ కోటేశ్వరరావు చేతులమీదుగా ప్రశంసపత్రం అందజేసి… అభినందించారు.

About Author