PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ పంచాయతీలకు అవార్డులు అందజేత..

1 min read

– జిల్లాస్థాయిలో కలకుర్రు కి రెండో స్థానం..
ఈవోపీఆర్డి సరళ కుమారి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సరళ కుమారి మాట్లాడుతూ జిల్లాస్థాయిలో కలకుర్రు పంచాయతీ రెండవ స్థానంలో నిలిచిందన్నరు. చాటపర్రు, గుడివాకలంక, కలకుర్రు, కాట్లంపూడి, మాదేపల్లి, మల్కాపురం, మొండికోడు, పెదయాగనమిల్లి, శ్రీ పర్రు 8 పంచాయతీలు మండల స్థాయిలో అవార్డులు పొందాయన్నారు . సర్పంచులను, కార్యదర్శులను, ఎంపీటీసీలను, పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సర్టిఫికెట్ మరియు మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మండల సరస్వతి కొండలరావు, ఈవోపీఆర్డి ఎం. సరళ కుమారి, ఏపీఓ కిషోర్ కుమార్, ఏవో వై. సుజాత, జూనియర్ అసిస్టెంట్ శివకుమార్ , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author