PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట సస్యరక్షణపై రైతులకు అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్, కర్నూలు: బిందు సేద్యం… వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, అప్పుడు పోషకాలతో కూడిన పంటను సాగు చేయెచ్చని స్పష్టం చేశారు షణ్ముఖ అగ్రిటెక్​ లిమిటెడ్​ కర్నూలు బ్రాంచ్​ రీజనల్ మేనేజర్​ శేఖర్​ బాబు అన్నారు. శుక్రవారం కర్నూలు మండలంలోని గార్గేయపురం, సింహవరం, శివరామపురం తదితర గ్రామాల్లో రైతులకు పంట సస్యరక్షణ, పంట పెరుగుదలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్​ఎం శేఖర్​ బాబు మాట్లాడుతూ సేంద్రీయం… జీవన వ్యవసాయంకు సంబంధించి నాణ్యమైన ఉత్పతులను అందిస్తున్నామన్నారు. తమ కంపెనీ తయారు చేసిన దక్ష, తేజస్వి, భద్ర, బహుళ, సేంద్రీయ ఎరువులు అయిన విరాట్​ ఆర్గానిక్​,విరాట్​ ప్రోమ్​, విరాట్​ సీఎంఎస్​, జీవన ఎరువులైన జీవనమిత్ర, కీర్తి తదితరవి వాడి మంచి దిగుబడులు సాధించారని తెలియజేశారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా.. పలు అంశాలను రైతులకు సంస్థ ఆర్​ఎం శేఖర్​ బాబు వెల్లడించారు. కార్యక్రమంలో సేల్స్​ ఆఫీసర్​ మధు, మార్కెట్​ డెవలప్​మెంట్​ టీం ఆఫీసర్​ ఈరన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author