NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోమ్ ఓటింగ్ పై ఎన్నికల సిబ్బంది అవగాహన ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  85 సంవత్సరాలు పైబడి మంచం మీద నుంచి లేవలేక అనారోగ్యం పాలైన సీనియర్ సిటిజన్లకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును ఎన్నికల కమిషన్ ఇంటి వద్దనే  వేసుకునేలా ఆదేశాలు జారీ చేయడంతో గురువారం నాడు గడివేముల గ్రామంలో ముస్లిం కాలనీలో ఉన్న సీనియర్ సిటిజన్ ఇంటి వద్ద డ్రై డ్రిల్ నిర్వహించారు ఓటు హక్కును ఎలా వేయాలో సెక్టోరల్ ఆఫీసర్ హేమ సుందర్ రెడ్డి. డీటీ గురునాథం. బిఎల్వోలు .పోలింగ్ ఏజెంట్లు. సూపర్వైజర్ ఎల్ల సుబ్బయ్య రెవిన్ ని సిబ్బంది కుటుంబానికి అవగాహన కల్పించారు ఇంటి వద్దకే ఈవీఎం తీసుకుని వచ్చి పోలింగ్ రోజున సీనియర్ సిటిజన్ ఓటు హక్కు వినియోగించుకుంటాడని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

About Author