NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు పోలీసు విధులపై అవగాహన..

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: విద్యార్థులకు పోలీసుల పై అవగాహన కార్యక్రమం ఓపెన్ హౌస్ ద్వారా వివరించినట్లు మహానంది ఎస్ఐ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు స్టేషన్లో పోలీసులు నిర్వహిస్తున్న విధులు మరియు వారు సమాజానికి చేస్తున్న సేవ, రికార్డుల నిర్వహణ , ఆయుధాల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

విద్యార్థులు అంకితభావంతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే తల్లిదండ్రులకు, గురువులకు, చదివిన పాఠశాలకు మంచి పేరు వస్తుందన్నారు. విద్యార్థులు దేశభక్తి కలిగి ఉండాలని సమాజ సేవలో ముందు ఉండాలని ఎస్​ఐ నాగార్జున రెడ్డి వెల్లడించారు.

About Author