PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటిఎస్ ’పై అవగాహన కల్పించుకోండి :ఎంపీడీఓ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మిడుతూరు: ఓటిఎస్ పట్ల గ్రామ ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు ఎంపీడీ వో  జి ఎన్ ఎస్ రెడ్డి. మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామ సచివాలయంలో గ్రామ ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందికి  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓటిఎస్ గురించి తెలియజేశారు. పదివేల రూపాయలు చెల్లించినట్లు అయితే వారికి గృహ హక్కు పత్రాలు అందజేస్తామని ఎంపిడిఓ అన్నారు. రోళ్లపాడు గ్రామంలో  ఉప్పరి రామలక్ష్మమ్మ పదివేల రూపాయలు  చెల్లించి నందున  ఆమెకు గ్రామ సర్పంచ్ రామస్వామి పంచాయతీ కార్యదర్శి విజయకుమారి విఆర్వో ప్రసాదు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఒ ధశరద రామాయ్యా, వి ఆర్ ఒ రాఘవేంద్ర, పి యాస్ మస్తాన్ వలి, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author