PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటు నమోదు అంశంపై అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఓటు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటిదని వయోజనులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకులను ఎంచుకున్నప్పుడే ప్రజలందరికీ అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పలాలు అందుతాయని కోటిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. సలీం భాష అన్నారు బుధవారం మండలంలోని రామనపల్లి గ్రామంలో కోటిరెడ్డి కళాశాల ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లందరికీ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. సలీం భాషా మాట్లాడుతూ, ప్రత్యేక శిబిరంలోని ఏడవ రోజు ఓటు నమోదు అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వయోజనులైన ప్రజలందరూ ఓటు హక్కును కలిగి ఉండాలని, తమ ఓటును నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కలిగిన వారంతా ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు, ఓటు నమోదు అవగాహన కార్యక్రమం అనంతరం ఎన్ ఎస్ ఎస్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం ప్రముఖ శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంతి వాలంటీర్లకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతతో పాటు సమాజ సేవలో పాలుపంచుకోవడం చాలా గొప్ప విషయం అని, సేవ ద్వారా మాత్రమే మనిషికి నిజమైన ఆనందం లభిస్తుందని ఇలాంటి అవకాశం ఎన్ ఎస్ ఎస్ ద్వారా రావడం విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం అని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి విజయలక్ష్మి దేవి, డాక్టర్ గురు మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమామహేశ్వరి,గ్రామ పెద్దలు రఘునాథ రెడ్డి, స్వరూపా రాణి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author