PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పౌష్టికాహార మాసోత్సవం’పై అవగాహన సదస్సు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్​ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ‘ పౌష్టికాహార మాసోత్సవంపై ఐసీడీఎస్​ పీడీ ప్రవీణ అవగాహన కల్పించారు. పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు పోషణ, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఆ తరువాత క్విజ్​ పోటీలు నిర్వహించి బహుమతి అందజేశారు. ప్రధాన ఇంద్ర ధనస్సు రంగులోని ఆహార పదార్థాలను తీసుకోవాలని, పిల్లల చేతులకు 7 రంగులు ఉన్న హెయిర్​ బండ్స్​ వేయడం జరిగింది. ఆ తరువాత అంగన్​వాడీ టీచర్లకు ప్రీ స్కూల్​ కిట్స్​ అందజేశారు. కార్యక్రమంలో స్కూల్​ ఇన్​చార్జ్​ హెచ్​ఎం, ఏఎన్​ఎం, మహిళా పోలీస్​, సూపర్​వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


About Author