PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాక్సిస్ బ్యాంక్ కు లాభాల పంట‌..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక‌టైన యాక్సిస్ బ్యాంక్ చివ‌రి త్రైమాసికం ఫ‌లితాలు ప్రక‌టించింది. 2020-2021 ఆర్థిక సంవ‌త్సరం మార్చితో ముగిసిన త్రైమాసికానికి నిక‌ర లాభం 2,677 కోట్లుగా న‌మోదైంది. గ‌త ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు 1388 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని ప్రక‌టించింది. బ్యాంకు నిక‌ర వ‌డ్డీ ఆదాయం 7,555 కోట్ల‌కు చేరుకుంది. గ‌త ఏడాది ఇదే త్రైమాసికంలో 6,808 కోట్లుగా న‌మోదైంది. గ‌తంతో పోలిస్తే ప్రస్తుతం 11 శాతం నిక‌ర వడ్డీ ఆదాయం పెరిగింది. గ్రాస్ ఎన్పీఏలు 5.25 శాతంగా.. నిక‌ర ఎన్పీఏలు 1.05 శాతంగా న‌మోద‌య్యాయి. గ‌తంతో పోలిస్తే ఎన్పీఏలు కూడ త‌గ్గ‌డం విశేషం.

About Author