PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అయోధ్య రాముని ఆనంద సంబరాలు..

1 min read

ఏలూరు రౌండ్ టేబుల్, హిందూ సంఘాల ఐక్య కార్యచరణ సమితి

రామకోటి శ్రీ రామాలయంలో నిర్వహణ..

అంబికా గ్రూప్ చైర్మన్ అంబికా కృష్ణ

పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా రామ మందిర ప్రాణ ప్రతిష్ట పండుగ..

రెడ్ క్రాస్ చైర్మన్ బి.వి కృష్ణారెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జనవరి 22 న ఏలూరులోని అయోధ్య రాముని ఆనంద సంబరాలను ఏలూరు రౌండ్ టేబుల్, హిందూ సంఘాల ఐక్య కార్యశరణ సమితి, అంబికా గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో  రామకోటిలో శ్రీరామా ఆలయంలో నిర్వహిస్తున్నట్లు అంబికా గ్రూప్ సంస్థల అధినేత అంబికా కృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ అయోధ్య రాముని ఆనంద సంబరాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏలూరు పెద్ద వంతెన నుండి మేళతాళాలతో, తీన్మార్ డప్పులతో, కోలాటాలతో మరియు భక్తుల భజన  కార్యక్రమాలతో అయోధ్య రాముని భారీ ఊరేగింపు రామకోటి వరకు జరుగుతుందని  అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అంబికా కృష్ణ కోరారు. రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట పండుగను యావత్ భారతదేశమే కాకుండా, విదేశాల్లోని కూడా ప్రజలు జరుపుకుంటున్నారని అన్నారు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతుందని, మన ఏలూరులోని ఈ సంబరాలను నిర్వహిస్తున్నమని, భక్తులందరూ కూడా  ఇది ఒక అద్భుత అవకాశంగా భావించి, భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంబికా సుదర్శన్, మడుపల్లి రత్నాకర్, పి కిషోర్, కనిగొల్ల సుధీర్, జి ఎస్ వి అమరేంద్ర, రిటైర్డ్ తహసిల్దార్ కేబీ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

About Author