PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆజాద్ సేవలు మరువలేనివి.. టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి టి.జి భరత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఆజాద్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆజాద్ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 లో అరెస్టు అయ్యాడన్నారు.  ఇలాంటి గొప్ప వ్యక్తి జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేటి విద్యార్థులు ఇలాంటి గొప్ప నాయకుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రిగా పనిచేసిన గొప్ప వ్యక్తి ఆజాద్ అన్నారు. ఇక తమ తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని టి.జి భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నేతలు జహంగీర్ బాషా, మన్సూర్ ఆలీఖాన్, హమీద్, నయీం, గౌస్, మాబాషా, బషీర్, అహ్మద్ ఆలీ, ఇబ్రహీం, నౌషాద్, దస్తగిరి, అన్వర్, యూనుస్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

About Author