NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపు రాష్ట్ర బంద్​కు బాబు పిలుపు!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కార్యాయాలపై వైసీపీ శ్రేణులు చేస్తోన్న దాడులను నిరసిస్తూ బుధవారం ఏపీ బంద్​కు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం అత్యవర మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుండాయిజం రాజ్యమేలుతోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మా పార్టీ నేతలు గంజాయిసాగు పెరిందని ప్రశ్నిస్తే, హెరాయిన్ గురించి మాట్లాడితే తప్పంటరా?, ప్రభుత్వ వైఖరిని ఎండగడితే దాడులు చేస్తారా? అంటూ బాబు మండిపడ్డారు. బుధవారం టీడీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్​ను విజయవంతం చేయాలని కోరారు.

About Author