PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిజం గెలవాలంటే బాబు రావాలి                   

1 min read

నారా భువనేశ్వరి పిలుపు                                   

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో నిజం గెలవాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. నిజం గెలవాలి నారా భువనేశ్వరి బస్సు యాత్రలో భాగంగా బుధవారం పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం కడమట్ల గ్రామంలో మృతి చెందిన టీడీపీ అభిమాని కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో మనస్థాపానికి గురైన టిడిపి అభిమాని వడ్డే చిన్న రాముడు మృతి చెందారు.నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి పత్తికొండ నియోజకవర్గంలో బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి తుగ్గలి మండలం,కడమకుంట్ల గ్రామంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వడ్డే చిన్న రాముడు కుటుంబా సభ్యులను కలిసి వారిని పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటాం అని హామీ ఇస్తూ, రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించారు. పత్తికొండ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కే.ఈ. శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వీటి నాయుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మనోహర్ చౌదరి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, తుగ్గలి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేంద్ర, టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం అశోక్ కుమార్, బత్తిని లోకనాథ్, ధనుంజయ తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

About Author