NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్యాడ్మింటన్ పున్నయ్య చౌదరికి డాక్టరేట్ ప్రధానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క్రీడారంగ సేవలకు గుర్తింపుగా  మలేషియాలోని కౌలాలంపూర్ మదర్ తెరెసా యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పితామహుడు పున్నయ్య చౌదరికి డాక్టరేట్ ప్రధానం చేసింది. పున్నయ్య చౌదరి  గత 60 సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ క్రీడాంశంలో అంపైర్, కోచ్, అడ్మినిస్ట్రేటర్, సీఈఓ గా సేవలందించిన నేపథ్యంలో చౌదరికి డాక్టరేట్ లభించడం పట్ల ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ .జి వెంకటేష్, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు టీజీ. భరత్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా ఒలింపిక అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు తదితర క్రీడా సంఘాలు పున్నయ్య చౌదరికి శుభాకాంక్షలు , అభినందనలు తెలిపారు.

About Author