PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బహుజనులు చైతన్యం కావాలి..

1 min read

– నందికొట్కూరు లో బీఎస్పీ  కార్యాలయం ప్రారంభం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బహుజనులు చైతన్యమై బహుజన రాజ్యం తేవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ అర్ జే మల్లికల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1955 దాదాపు 47 సంవత్సరాలు రెడ్లు ఎమ్మెల్యేలుగా  పరిపాలించారు.అయితే కేవలం పట్టుమని 2000 ఓట్లు లేని రెడ్లు అన్ని  సంవత్సరాలు పరిపాలించారంటే  ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలైనా మనం ఎంతో సిగ్గుపడాలన్నారు. 2009 నుండి ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఏర్పాటయిందని ఇప్పుడు కూడా వారి ఆధిపత్యమే ఉందని  ఎస్సీ ఎమ్మెల్యేలకు సమాంతరంగా వారి ఆధిక్యత కొనసాగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ , టిడిపిల ద్వారా గెలిచింది రెడ్లే.ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఏర్పడినా ఆ పార్టీల ద్వారా ఎన్నికైన ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా వారి ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారని విమర్శించారు.  వైఎస్ జగన్ కు ఎస్సీ ప్రజల ప్రయోజనాల కన్నా తన రెడ్డి సామాజిక వర్గ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు  .టిడిపి చంద్రబాబుకు ప్రజలు ఎటు పోయినా తన ప్రభుత్వం ఏర్పాటు కమ్మల ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. మన సమస్యలు పరిష్కారం కావాలన్నా మనం రాబోయే తరాలు ఆర్థికంగా సామాజికంగా బలపడాలంటే  ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు చైతన్యమై ఏనుగు గుర్తుపైనే ఓటు వేయాల్సిందేనని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మహేంద్ర, జిల్లా ఇన్చార్జి గద్దల లాజర్ , నందికొట్కూర్ అసెంబ్లీ ఇన్చార్జి ఎల్ స్వాములు, నందికొట్కూరు అధ్యక్షులు నాగన్న , నాయకులు వినయ్, మనోజ్, ఆది ,శ్రీను, నాగేంద్ర, చరణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author