NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత బెయిల్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: టీడీపీ కేంద్ర కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రకు అర్ధరాత్రి దాటిన తరువాత బెయిలు లభించింది. నరేంద్రను మొన్న రాత్రి అరెస్టు చేసిన సీఐడీ అధికారులు నిన్నసాయంత్రం ఆరు గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచేందుకు గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ప్రాంగణానికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయమూర్తి ఇంటి వద్ద నరేంద్రను హాజరుపరిచారు. సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారన్న నరేంద్ర ఫిర్యాదు నేపథ్యంలో తొలుత ఆయనకు జీజీహెచ్‌లో పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి కె.శృతవింద అధికారులను ఆదేశించారు.

                                       

About Author