PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబుకు బెయిల్ టీడీపీ శ్రేణుల్లో సంబరాలు     

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో టిడిపి శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. మంగళవారం పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ శ్యామ్ కుమార్  ఆధ్వర్యంలో పత్తికొండ లో బాబుకు బెయిల్ రావడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు.స్థానిక సుంకం గేట్ వద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు   చిత్ర పటానికీ పాలబిషేకం చేసి అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని బాబుకు బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివరెడ్డి, రామానాయుడు అశోక్ కుమార్ తిరుపాలు సంజప్ప కోసూరు శ్రీనివాసులు పెద్ద హెల్త్ తిప్పన్న నలకదొడ్డి బత్తిని లోక్నాథ్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకటరాముడు పత్తి ప్రసాద్ మనోహర్ చౌదరి సింగం శ్రీనివాసులు మీరా హుస్సేన్ ఉచ్చురప్ప శ్రీనివాసులు గౌడ్ సురేంద్ర గోవింద గౌడ్ బిటి. గోవిందు తదితరులు నాలుగు స్తంభాలు కూడా రోజుకు చేరుకొని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వారు తమ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలు గ్రామాల నుండి టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని బాబుకు బెయిల్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author