NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా కోసం బాలకృష్ణ మౌనదీక్ష !

1 min read

పల్లెవెలుగువెబ్ : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందూపురంలో మౌనదీక్ష చేపట్టారు. పట్టణంలోని పొట్టిశ్రీరాములు సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పొల్గొన్నాయి. అనంతరం అంబేద్కర్ సర్కిల్ లో మౌనదీక్షకు దిగారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సాయంత్రం జరిగే అఖిలపక్ష సమావేశంలోనూ బాలకృష్ణ పాల్గొననున్నారు.

           

About Author