PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ఎన్నిక

1 min read

– సత్కరించిన కాపు యువనేత, బిజెపి నాయకులు: కొట్టె మల్లికార్జున

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త మరియు అభిమానిగా  ఉండి, కార్పొరేటర్,ఎమ్మెల్యే  స్థాయిల నుంచి   కరీంనగర్ ఎంపీ గా పోటీ చేసి గెలుపొందిన మరియు పూర్వ బిజెపి తెలంగాణ అధ్యక్షులు,  అంచలంచెలుగా ఎదుగుతూ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుల నుంచి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం  యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిజెపి యువ నాయకులకు మరియు కాపు బిడ్డలకు ఆదర్శం మరియు గర్వకారణముగా పేర్కొనవచ్చు.కాపు యువనేత  మరియు బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపులు బిజెపి పార్టీ లో  రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ యువకులకు స్ఫూర్తి ప్రదాతలు గా నిలుస్తున్నారు అని మీడియా వేదిక గా పేర్కొన్నారు. కాపు పెద్దలు శ్రీ బండి సంజయ్ అన్న ఎదిగిన విధానమే  నా లాంటి  కాపు  యువ నాయకులు  మరియు బిజెపి యువ నాయకులకు ఆదర్శం.అందుకుగాను  కాపు యువ నేత మరియు బిజెపి యువ నాయకులుగా గర్వపడుతున్నాను.నేను గతంలో సివిల్స్ ప్రిపరేషన్ తర్వాత బిజెపి పార్టీ అభిమాని గా, కాపు బిడ్డగా కాపు పెద్దలు సహకారంతో, బిజెపి పార్టీ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు సహకారంతో బిజెపి  మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి గా  పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ అరంగ్రేటం చేయడంతో పాటు, ప్రస్తుతం బిజెపి పార్టీ లో యువ నాయకులుగా ఎదిగినందుకు గర్వపడుతున్నాను. కాపు బిడ్డలకు మరియు బిజెపి పార్టీ తరుపున  పేద ప్రజలకు అండగా ఉండి పోరాటం చేసే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం అని కాపు పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయిన కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ అన్న పేర్కొనడం జరిగిందని పేర్కొన్నారు.  కాపు ఆత్మీయ అభినందన సభలో కాపు పెద్దలు బండి సంజయ్ మాట్లాడుతూ “బండి సంజయ్ అనే నేను ” బిజెపి పార్టీ లో సామాన్య కార్యకర్త నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికావడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. అలాగే కాపులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు తెలంగాణ రాష్ట్రంలో అధిక శాత జనాభాను కలిగి ఉండటమే కాకుండా, తమ ఓట్లతో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాపులు, కాపు యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు కాబట్టి కాపు బిడ్డలతో పాటు, ఇతర అన్ని వర్గాల యువత రాజకీయాల్లోకి రావాలి అని పేర్కొన్నారు. కాపుల ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న   కాపు పెద్దలకు,కాపు బిజెపి యువ నాయకులకు , బిజెపి అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎంపిక అయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధన్యవాదాలుమరియు కృతజ్ఞతలు తెలిపారు.

About Author