PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొలంలో ‘బంగారు బిందె’..!

1 min read

జ‌న‌గామ‌: ఓ రైతు పొలంలో బంగారు బిందె దొరికింది. అందులో బంగారం, వెండి ఆభ‌ర‌ణాలు ఉన్నాయి. ఆ బంగారు బిందెను చూస్తే చాలా ఏళ్లనాటి పురాత‌న బంగారు బిందెగా క‌నిపిస్తోంది. ఈ సంఘ‌ట‌న జ‌న‌గామ జిల్లా పెంబ‌ర్తి గ్రామంలో జ‌రిగింది. హైద‌రాబాద్ కు చెందిన న‌ర్సింహ అనే వ్యక్తి పెంబ‌ర్తి గ్రామ ప‌రిధిలో హైద‌రాబాద్- వ‌రంగ‌ల్ వెళ్లే హైవేలో 11 ఎక‌రాల పొలం కొన్నాడు. ఆ పొలంలో రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వేయాల‌ని .. భూమి మొత్తం చ‌దును చేశాడు. ఈ క్రమంలో జేసీబీ చ‌దును చేస్తుండ‌గా.. లంక బిందె క‌న‌ప‌డింది. దీంతో న‌ర్సింహ అధికారుల‌కు స‌మాచారం అందించారు. అధికారులు ఆ బిందెను తెర‌చి చూడ‌గా.. 17 తులాల బంగారం, 10 కిలోల వెండి ల‌భ్యమైంది.

About Author