PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వచ్ఛత హి సేవ లో బ్యాంకు ఉద్యోగులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజియనల్ మేనేజర్  P. S. నవీన్ ఆధ్వర్యంలో లో V R కాలనీ పార్క్ పరిసర ప్రాంతంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం లో భాగంగా రోడ్లను శుభ్రం చేయడం జరిగింది.. ఈ సందర్బంగా గా రీజినల్ మేనేజర్ మన డైనంది న జీవితంలో పరిశుభ్రత కీలక పాత్ర పోసిస్తుందని, పరిశుభ్రత ను పెంపోందిoచడానికి  దేశం చేస్తున్న ప్రయత్నమే ఈ కార్యక్రమం అని కొనియాడారు. పరిశుభ్ర భారత్ కి ప్రతి ఒక్కరు పాటుపడినప్పుడు మాత్రమే అది సాకారం అవుతుంది అని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో రీజినల్ ఆఫీస్ సీనియర్ మేనేజర్ లు K V నరేంద్ర , జాబిబుల్లా ఖాన్ , ప్రవీణ్ కుమార్ రెడ్డి , మరియు అసోసియేషన్ నాయకులు D. రియాజ్ బాషా , హనుమంత రెడ్డి , వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సురేష్  మరియు చుట్టు పక్కల బ్రాంచి మేనేజర్ లు మరియు వారి సిబ్బంది పాలొగొన్నారు.

About Author