PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంక్​ పరీక్షలు ఇకనుంచి ప్రాంతీయ భాషల్లోనే! కేంద్రం

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: దేశంలో రాష్ట్రాల వారీగా ఆయా ప్రభుత్వ రంగ బ్యాంక్​లు నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలను ఇక నుంచి ప్రాంతీయ భాషల్లోనే జరపాలని కేంద్ర ఆర్థికశాఖ సూచించింది. ఈమేరకు గురువారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ప్రభుత్వ రంగ బ్యాంక్​లు తమ పరిధుల్లోని ఉద్యోగ పోటీ పరీక్షలను ఆయా రాష్ట్రాలకు సంబంధించిన మాతృభాషల్లోనే నిర్వహించాల్సి ఉంటుంది. బ్యాంక్​ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇది తీపికబురే. దేశంలోని మొత్తం 13ప్రాంతీయ భాషల్లో బ్యాంక్​లకు సంబంధించిన ప్రిలిమ్స్​, మెయిన్స్​ పరీక్షలను ఇంగ్లీష్​, హిందీ భాషలతోపాటు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లోనూ జరపాలని కేంద్రం పేర్కొంది. ఇప్పటికే కొన్ని బ్యాంక్​లు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

About Author