PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్టోబర్‌లో బ్యాంక్​లకు 21 రోజులు సెలవులు! ఆర్​బీఐ

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: బ్యాంక్​ ఖాతాదారులకు షాకింగ్​ న్యూస్​ ఇది. రిజర్వు బ్యాంక్​ ఇండియా అక్టోబర్​ నెలలో బ్యాంక్​లకు 21రోజులపాటు సెలవులు ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ నెల పనిదినాలపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఏకంగా 21 రోజులు బ్యాంకులు పనిచేయవని స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాదారులు తమ లావాదేవీలను మిగిలిన రోజుల్లో జరుపుకోవాలని సూచించింది. ఈ క్రమంలో అక్టోబర్ 2న మహాత్మగాంధీ జయంతి, అనంతరం విజయదశమి సందర్భంగా 12, 13, 14, 15, 16 తేదీలు, 5 ఆదివారాలు, 2వ శనివారం, 4వ శనివారం, దీంతో పాటు అక్టోబర్ 1, 6, 7, 18, 19, 20, 22, 26 తేదీల్లోనూ బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ ప్రకటించింది. దీన్నిబట్టి ఖాతాదారులు బ్యాంక్​లకు సహకరించాలని కోరింది.

About Author