PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాటకం నిషేధించడం సంస్కృతిపై దాడే

1 min read

పల్లెవెలుగువెబ్ : చింతామణి నాటకాన్ని నిషేధించడం సంస్కృతి పై దాడేనని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చింతామణి నాటకాన్ని నిషేధించిందని, దీనిపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు. వందేళ్ల చరిత్ర కలిగిన చింతామణి నాటకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. మాతృభాష, సాహిత్య, సాంస్కృతిక విలువలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని గర్హించారు.

         

About Author