NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిసి కార్పొరేషన్ రుణాలు అర్హులందరికీ అందించాలి. టీ. మురళి నాయుడు

1 min read

పల్లెవెలుగు ,ఎమ్మిగనూరు ప్రతినిధి:  ఎమ్మిగనూరు పట్టణంలో బిసి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాలను ప్రభుత్వం పారదర్శకంగా, వివక్ష లేకుండా అందించాలని వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షుడు టీ. మురళి నాయుడు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిసి వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాలు, ఇతర పథకాలను అర్హులందరికీ సమానంగా పంపిణీ చేయాలని సూచించారు. అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో కూటమి నాయకుల ప్రమేయం లేకుండా, రాజకీయాలకు అతీతంగా, పూర్తిగా అర్హత ప్రమాణాలను ఆధారంగా చేసుకుని లబ్ధిదారుల జాబితాను అధికారులు స్వతంత్రంగా సిద్ధం చేయాలి అని పేర్కొన్నారు.రుణాలు అన్ని బిసి వర్గాలకూ అందాలి బిసి వర్గాల్లోని అన్ని ఉపవర్గాలకు ఈ రుణాలు అందించాల్సిన అవసరం ఉందని మురళి నాయుడు స్పష్టం చేశారు. కొన్ని వర్గాలకు మాత్రమే మంజూరు చేసి, మరికొన్ని వర్గాలను విస్మరించే విధంగా వ్యవహరించకూడదని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రుణాల ద్వారా బిసి వర్గాల్లోని నిరుపేదలకు ఆర్థికంగా ఉపశమనాన్ని కలిగించడంతో పాటు, వారి జీవనోపాధికి తోడ్పడే అవకాశాన్ని కల్పించాలన్నారు.బిసి వర్గాలకు చెందిన చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి దారులు, వృత్తి ఆధారిత కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడంలో ఈ రుణాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొందరికే లబ్ధి చేకూరుతోందని, అలాంటి వివక్షకు తావివ్వకూడదని ఆయన అన్నారు.అధికారులు పారదర్శకంగా వ్యవహరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని మురళి నాయుడు డిమాండ్ చేశారు. పథకాలను అమలు చేసే సమయంలో ఎటువంటి అన్యాయానికి తావులేకుండా, అన్ని నియమాలను అనుసరించి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు.ఈ రుణాల పంపిణీలో అర్హులైన ఒక్కరికీ కూడా అన్యాయం కాకుండా చూడాలని, అందుబాటులో ఉన్న నిధులను సమానంగా పంపిణీ చేయాలని, బిసి వర్గాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని టీ. మురళి నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *