PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీలు ఐక్యతతో.. రాజ్యాధికారం సాధించాలి

1 min read

– వై.నాగేశ్వరరావు యాదవ్ , తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్

పల్లెవెలుగు: బీసీలు ఐక్యమత్యంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్. బుధవారం  శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గ,పట్టుపురమ్ నందు అధ్యక్షులు జగదేశ్వరరావు గారి అధ్యక్షతన టిడిపి బీసీ యాదవ సాధికార పోరుబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ ,తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నూకాలమ్మ,స్టేట్ మెంబర్ వాసు, కృష్ణమూర్తి,రవి  ,కేసవయ్య యాదవ్, వెంకటరావు,జోగరావు,రవి కుమార్, నవీన్ యాదవ్, రాజేష్,బీమరావు,రాజారావు ,రమేష్ ,నిలయ్యా ,మొదలైన బిసి, యాదవ నాయకులతో కలిసి యాదవ సాధికార పోరుబాట కరపత్రాలను విడుదల చేయడం జరిగినది. అనంతరం వారు  మాట్లాడుతూ బీసీలంతా ఏకమై ఈ వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటును చేసి, వైసీపీ నాయకులు మన ఓటు హక్కుతో తగిన గుణపాఠం చెప్పాలి. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి మన ఓటు ఒక చెంపపెట్టు లా అవ్వాలి. యాదవులంతా ఒకే తాటి పైకి వచ్చి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.బీసీలంతా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలి.చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని,దానికి అనుగుణంగా మనమందరం కలిసికట్టుగా కృషిచేసి ఈ వైసీపీ నాయకుల అరాచకాలను అక్రమాలను ప్రజలకు వివరిస్తూ, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, గ్రామ గ్రామాన ప్రతి ఇంటి తలుపు తట్టి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను వివరించి, తెలుగుదేశం పార్టీకి గెలుపునకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలి.

About Author