PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీలు ఐక్యంగా టిడిపి  విజయానికి కృషి చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    బీసీలు ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నరసింహ కోరారు. స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఈ ఇరువురు పాత్రికేయులతో మాట్లాడుతూ కోడుమూరు నియోజవర్గం కర్నూలు మండలం, మున్సిపల్ పరిధిలో ని గీతా ముఖర్జీ నగర్ లో ఈనెల 23 వ తేది మంగళవారం   సాయంత్రం 4 గంటలకు *జయహో బిసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు గౌ ” శ్రీ కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి , కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌ ” శ్రీ బి టి నాయుడు గారు, కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  గౌ ” శ్రీ ఆకె పోగు ప్రభాకర్ గారు కోడుమూరు నియోజవర్గం పరిశీలకులు డాక్టర్ శ్రీనివాసమూర్తి    ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ జయహో బి సి కార్యక్రమానికి బీసీ కమిటీ నాయకులు, సాధికార కమిటీ నాయకులు, మిత్ర సేన అయిన జనసేన పార్టీ నాయకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము.

About Author