NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌శువుల కాప‌రిగా అయిన ఉంటా.. కానీ టీడీపీని వీడను !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష‌డు బ‌క్కిన న‌ర‌సింహులు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పశువుల కాపరిగా ఉంటానని, తెలుగుదేశం పార్టీని మాత్రం వీడనని టీటీడీపీ అధ్యక్షుడు బక్కిన నరసింహులు అన్నారు. ఎన్టీఆర్ భవన్‎లో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బక్కిన నర్సింహులు మాట్లాడుతూ చనిపోతే పసుపు జెండా కప్పాలన్న చాలామంది నేతలు పార్టీని వీడారన్నారు. హైదరాబాద్‌ను అందమైన .. ఆనంద నగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. చంద్రబాబు అత్యంత ప్రజాస్వామిక వాది అని.. పరిపాలన దక్షకుడు అని బక్కిన నర్సింహులు అన్నారు.

                               

About Author