PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొట్టుకున్న ఎస్పీలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హిమాచ‌ల్ ప్రదేశ్ లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రజ‌ల‌ను అదుపులో ఉంచాల్సిన పోలీసులే త‌న్నుకున్నారు. హిమాచ‌ల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరి ప‌ర్యట‌న సంద‌ర్భంగా కులు విమానాశ్రయం స‌మీపంలో రైతు సంఘాలు ఆందోళ‌న‌కు దిగాయి. ఈ విష‌యం పై కులు జిల్లా ఎస్పీ, సీఎం భ‌ద్రతా సిబ్బంది మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. స‌హ‌నం కోల్పోయిన కులు ఎస్పీ గౌర‌వ్ సింగ్ , సీఎం భ‌ద్రతా సిబ్బందిలోని ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్ చెంప చెల్లుమ‌నిపించారు. అక్కడే ఉన్న సీఎం భ‌ద్రతా సిబ్బందిలోని అధికారి బ‌ల్వంత్ సింగ్ .. ఎస్పీ గౌర‌వ్ సింగ్ ను కాలితో త‌న్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘ‌ట‌న పై హిమాచ‌ల్ ప్రదేశ్ ప్రభుత్వం సీరియ‌స్ అయింది. ఉన్నత స్థాయి విచార‌ణ‌కు ఆదేశించింది.

About Author