PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార్య‌ను చెట్టుకు క‌ట్టేసి కొడుతూ.. ఎక్క‌డ జ‌రిగిందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజస్తాన్‌లోని బన్స్వారా జిల్లాలో ఓ మహిళను ఆమె భర్త, భర్త తరుపు ఇతర బంధువులు ఆమెను చెట్టుకి కట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆ మహిళ దెబ్బలకి తాళలేక కేకలుపెడతూనే ఉంది. ఆమెను తన స్నేహితుడితో ఉండటం చూసిన సదరు వ్యక్తి ఆగ్రహవేశాలకు లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో కనిపించిన వ్యక్తిని కూడా చెట్టుకు కట్టి ఇలానే హింసించారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో బీజేపీ నేతలు రాజస్తాన్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శల ఎక్కుపెట్టారు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ రాజస్తాన్‌ డీజీపీకి లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయడమే కాకుండా బాధితురాలికి తగిన వైద్యం అందించి, భద్రత కల్పించాలని అధికారులను కోరారు.

                                            

About Author