PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరకలెత్తిన ఉత్సాహంతో మరోసారి గెలుపు సాధించిన బీరం విద్యార్థులు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు  : సి.బి ఎస్. ఇ సౌత్ జోన్, క్లస్టర్స్ అండర్- 19 కో..కో ఆటలో గెలుపొందిన బీరం శ్రీధర్ రెడ్డి విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని సాయి ప్రకాష్ విద్యానికేతన్ స్కూల్ లో నిర్వహించిన కో..కో పోటీల్లో కడప జిల్లా, ఖాజీపేట మండల పరిధిలోని బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు జాతీయస్థాయి సౌత్ జోన్ క్లస్టర్స్ లో గెలిచి మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత బీరం సుబ్బారెడ్డి , చైర్పర్సన్ సరస్వతమ్మ లు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు కోకో పోటీల్లో గెలిచి బీరం విద్యాసంస్థల కీర్తి పతాకాన్ని ఎగురవేశారని తెలిపారు.మరియు వరుసగా తమ విద్యార్థులు సాధిస్తున్న విజయాలకు వారు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.ఈ విజయోస్థాహం లో విద్యాసంస్థల డైరెక్టర్ బీరం స్వాతి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఏ ఆటలో గెలుపు సాధించాలన్న ప్రత్యేక శిక్షణ అవసరం అన్నారు.అటువంటి శిక్షణ తమ పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయులు, పిల్లలకు మెలకువలతో కూడిన శిక్షణ ఇస్తారు అని వారు కొనియాడారు. గెలిచిన విద్యార్థులను మరియు శిక్షణ ఇచ్చిన పి.ఈ.టిలను వారు మెచ్చుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా , కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్ మరియు పి .యి. టి లు పాల్గొన్నారు.

About Author