PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిచ్చ‌గాడి అంతిమ‌యాత్ర‌.. వేలాది మంది జ‌నం !

1 min read

పల్లెవెలుగు వెబ్​:  సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కుల అంతిమ‌యాత్ర‌ల్లో వేలాది మంది జ‌నం పాల్గొన‌డం స‌ర్వ‌సాధార‌ణంగా చూస్తుంటాము. కానీ ఓ బిచ్చ‌గాడు. సొంత ఇల్లు లేదు. నా అన్న‌వాళ్లు లేరు. క‌న‌పడ్డ వారిని ఒక్క రూపాయి మాత్ర‌మే అడిగి తీసుకుంటాడు. అలాంటి బిచ్చ‌గాడు చ‌నిపోతే వేలాది మంది జ‌నం అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో అత‌ని మ‌ర‌ణానికి సంతాపం ప్ర‌కటిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఘ‌ట‌న‌ క‌ర్ణాట‌క‌లో  విజ‌య‌న‌గ‌ర జిల్లాలోని హూవిన‌హ‌డ‌గ‌లిలో జ‌రిగింది. మాన‌సిక దివ్యాంగుడైన హుచ్చ‌బ‌స్య రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ హుచ్చ బ‌స్య మృతిచెందాడు. ఈ విష‌యం తెలియ‌గానే హూవిన‌హ‌డ‌గ‌లి ప‌ట్ట‌ణం క‌న్నీటిసంద్ర‌మైంది. స్థానికులంతా క‌లిసి ద‌హ‌న‌సంస్కారాలు నిర్వ‌హించారు. వేలాదిగా అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు.

About Author