PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబుకు న్యాయం కావాలంటూ బిక్షాటన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కర్నూల్లో టిడిపి నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టి.జి భరత్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట బిక్షాటన చేపట్టారు. రోడ్డుపై నిలబడి చంద్రబాబుకు న్యాయం కావాలంటూ బిక్షం ఎత్తుకున్నారు. అటు వైపుగా వెళ్తున్న వాహనదారులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్టయ్యారని చెప్పారు. ఆయనకు న్యాయం కావాలని తాము కోరుతున్నామన్నారు. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేకనే కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని టిడిపి నేతలు అన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు నాగరాజు యాదవ్, అబ్బాస్, ముంతాజ్, సత్రం రామక్రిష్ణుడు, ఈశ్వర్, రాజశేఖర్ యాదవ్, మోహన్, శ్రీనివాసులు, రమీజ్, సుందరరాజ్, తదితరులు పాల్గొన్నారు.

About Author