PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ పాలననే ప్రజలు విశ్వసిస్తున్నారు..

1 min read

హోళగుంద మండల కేంద్రంలోని వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం

మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్

పల్లెవెలుగు, హొళగుంద: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు విశ్వసిస్తున్నారని అందుకనే మరల ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధమయ్యారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం  తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్ పేర్కొన్నారు. జగనే ఆంధ్రాకి ఎందుకు కావాలి అనే కార్యక్రమం లో భాగంగా హోళగుంద మండల కేంద్రమైన హోళగుంద సచివాలయం-3పరిధిలో మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజల్లో మమేకమై వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలందరినీ వైసీపీ వైపు ఆకర్షింప చేస్తున్నారని తెలుపుతూ రానున్న ఎన్నికల్లో మరల జగన్మోహన్ రెడ్డిని సీఎం గా, ఆలూరు ఎమ్మెల్యేగా నాన్న,గుమ్మనూరు జయరాం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీ, ఎంపీపీ తనయుడు ఈషా,వైస్ జడ్పిటిసి బావ శేషాప్ప,   జెసిఎస్ మల్లికార్జున,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author