PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని కలమందలపాడు,మాసపేట,49బన్నూరు గ్రామాలలో జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ శాఖ డిఈఈ ప్రభాకర్,ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్ లు కలసి కాలనీలలో ఉన్న లబ్ధిదారులతో త్వరగా ఇండ్లను ఉగాది లోపు పూర్తి చేయాలని లబ్ధిదారులకు వారు తెలియజేశారు.ఆర్థిక సమస్య ఉన్నట్లయితే వారికి పొదుపు సంఘాల నుండి రుణాలు ఇస్తామన్నారు.వివిధ దశలలో ఉన్న ఇండ్లను వేగవంతం చేయాలని ఎప్పటికప్పుడు బిల్లులు వస్తున్నాయని అన్నారు.ఈకార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు హౌసింగ్ ఇన్చార్జి ఏఈ రమేష్,అస్రఫ్ భాష,ఎం.రవీంద్రబాబు,బీజాన్ బి,అన్వర్ భాష,వర్క్ ఇన్ స్పెక్టర్లు సుబ్బ నాయక్,అంజద్ భాష మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author