NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. చంద్ర శేఖర్​ కు…అత్యుత్తమ అవార్డు..

1 min read

కర్నూలు( హాస్పిటల్​), న్యూస్​ నేడు :డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​, కర్నూలు వాసి, సీనియర్​ కార్డియాలజిస్ట్​ డా. చంద్ర శేఖర్​కు  అత్యుత్తమ పురస్కారం వరించింది. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి… రాష్ట్ర స్థాయిలో ప్రజల మన్ననలు పొందిన వీసీ డా. చంద్ర శేఖర్​ కు లయన్స్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా ప్రతిష్టాత్మక ఛాంపియన్​ ఆఫ్​ చేంజ్​ అవార్డు అందుకున్నారు.  ఆదివారం కలకత్తాలోని ఐటీసీ రాయల్​ బెంగాల్​ హోటల్​ లో నిర్వహించిన కార్యక్రమంలో డా. చంద్ర శేఖర్​ కు అవార్డు అందజేశారు. దేశంలోని 13 మంది ఈ అవార్డుకు ఎంపిక కాగా… అందులో డా. చంద్ర శేఖర్​ ఉండటం గర్వించదగ్గ విషయమని ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ సభ్యులు, మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​ చిట్టి నర్సమ్మ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *