డా. చంద్ర శేఖర్ కు…అత్యుత్తమ అవార్డు..
1 min read
కర్నూలు( హాస్పిటల్), న్యూస్ నేడు :డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, కర్నూలు వాసి, సీనియర్ కార్డియాలజిస్ట్ డా. చంద్ర శేఖర్కు అత్యుత్తమ పురస్కారం వరించింది. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి… రాష్ట్ర స్థాయిలో ప్రజల మన్ననలు పొందిన వీసీ డా. చంద్ర శేఖర్ కు లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు అందుకున్నారు. ఆదివారం కలకత్తాలోని ఐటీసీ రాయల్ బెంగాల్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో డా. చంద్ర శేఖర్ కు అవార్డు అందజేశారు. దేశంలోని 13 మంది ఈ అవార్డుకు ఎంపిక కాగా… అందులో డా. చంద్ర శేఖర్ ఉండటం గర్వించదగ్గ విషయమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ చిట్టి నర్సమ్మ తెలిపారు.
