NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విధుల్లో ఉత్తమ పని తీరు… అధికారులకు సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివెముల: మండలం నుంచి ముగ్గురికి కమెండేషన్ సర్టిఫికెట్లు 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రభుత్వ సిబ్బందికి నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలాని సామూన్  చేతుల మీదుగా కమాండేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. గడివేముల మండలం నుంచి రి సర్వే డిప్యూటీ తాసిల్దారు బుర్గన్న, పోలీసు కానిస్టేబుల్ రామాచారి, ఈవో ఆర్ డి అబ్దుల్ ఖాలిక్ ఎంపికయ్యారు. ఈ గౌరవం అందుకోవడం పై వారు ఆనందం వ్యక్తం చేశారు. విధుల్లో తమ పరిధిలో నిబద్ధత తో కూడిన సేవ చేశామని ప్రభుత్వం గుర్తించడం పట్ల రానున్న రోజుల్లో ప్రజలకు మరింత ఉత్సాహంతో సేవ చేస్తామన్నారు .

About Author