10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ…
1 min read
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండలం కేంద్రం లోని జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫలితాలలో చదువుతున్న విద్యార్థులు ఎస్ ఎన్ సందేశ్ 584 మార్కులు ఎస్ ప్రవలిక 578 రంజిత్568 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నజీర్ అహ్మద్ బుధవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 248 విద్యార్థులకు గాను 147 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాఠశాల ఉత్తీర్ణత శాతం 53 వచ్చిందని తెలిపారు పాఠశాల విద్యార్థి ఎస్ ఎన్ సందేశ్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లాలోనే రెండవ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుడు సన్మానించినట్లు తెలిపారు విద్యార్థులు మంచి భవిష్యత్తు భవిష్యత్తులో మంచిగా రాణించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
