NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ టాలెంట్​…!

1 min read

– క్యాంపస్ ఎంపికలో ప్రతిభ కనబరిచిన శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : పట్టణంలోని మాసాపేట శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయిన ఐ-క్యూబ్ యిన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎంపికయ్యారు. గురు, శుక్రవారం ఐ-క్యూబ్ యిన్నోవేటివ్ సంస్థ నిర్వహించిన వర్చువల్​ విధానంలో మూడు దశల ఇంటర్వ్యూలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న మయానా హేభాకనమ, పైడి త్రివేణి షేక్ మసేర మరియు గాండ్లపెంట రిజ్వాన విశేష ప్రతిభ కనబరిచారు.

ఎంపికైన విద్యార్థులకు మూడు లక్షల వార్షిక వేతనం మరియు ఇతర అలవెన్సులు అందుతాయని శ్రీసాయి విద్యాసంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్‌ M. సుధాకర్ రెడ్డి వెల్లడించారు. కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్ , ఆర్థమెటిక్, రీజనింగ్ తదితర అంశాలలో పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తోనే ఇది సాధ్యపడిందని ప్లేస్మెంట్ అధికారి ఇంతియాజ్ అభిప్రాయపడ్డారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.బాలాజీ వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందించారు.

About Author