PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన జేసీకి..’ఏపీజేఎఫ్​’ శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు జాయింట్​ కలెక్టర్​గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన నారపు రెడ్డి మౌర్యకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీజేఎఫ్​ నాయకులు.  ఆంధ్రప్రదేశ్​ జర్నలిస్టు ఫోరం (ఏపీజేఎఫ్)​ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి రామకృష్ణ, ఎం.సాయి కుమార్ నాయుడు,  కోశాధికారి. జి సామెల్ ఉదయం 11 గంటలకు జేసీ ఛాంబరులో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి.. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కర్నూలు హౌసింగ్​ జేసీగా ఉంటూ…నవరత్నాల్లో భాగంగా ’ పేదలందరికీ ఇల్లు’ పథకం ప్రజలకు చేర్చడం , వాటర్​ సప్లై, ఎలక్ర్టికల్ తదితర మౌలిక వసతులు కల్పించి… లబ్ధిదారులతో ఇల్లు ప్రారంభింపజేయడంలో విజయం సాధించి.. రాష్ట్రంలో కర్నూలు జిల్లాను 5వ స్థానంలో నిలిపారని ఏపీజేఎఫ్​ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  గుర్తు చేశారు. ప్రస్తుతం జాయింట్​ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన మీరు… జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడుపుతారన్న నమ్మకం ఉందన్నారు. జాయింట్ కలెక్టర్​ను కలిసిన వారిలో ఉరుకుందు, కుమార్​, రవి, వీడియో ఫోటో జర్నలిస్ట్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, మధుసూదన్​ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

About Author